ఏది మనది
రోదిస్తున్న పసి గుడ్డుని
ఊయలలో వేసి నిద్రపుచ్చుతుంది అమ్మ.
పెరిగే భారం భరించలేక
ఉయ్యాలలా ఊగింది భూమాత.
కాళ్ళ కింద భూమి
వణికిన వేళ
ఆకాశాన్ని తాకిన మేడలు
అమ్మ ఒడి చేరిపోయాయి.
కలల సౌధాల కింద
బతుకులన్నీ బుగ్గి అయిపోయాయి
నాది అనుకున్న ది
నన్నే బలి తీసుకుంది
నీడనిచ్చిన గూడు
నా సమాధి అయింది
అశాశ్వతమైన ఆనందం
క్షణాల్లో ఆవిరయ్యింది.
రక్తసంబంధం,
కలుపుకున్న బంధం,
పెంచుకున్న స్నేహబంధం,
అన్ని ఒకే క్షణంలో
చిరునామా మార్చుకున్నాయి.
గాలి తాకిన రేణువులా
ఆశలు క్షణంలో అదృశ్యం
కొండంత కోరికలతో
కోట్లు సంపాదించాలని ఆశయం
మానవ మనుగడే ప్రశ్నార్థకం
ఎందుకో ఈ తాపత్రయం
ఏది మనది?
ఏది మిగిలేది ?
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కా కినాడ
9491792279