సిరి మరియు మహా చిన్ననాటి స్నేహితులు. చిన్నప్పటినుండి 
సిరి మహా వాళ్ళు హైదరాబాద్ లోని ఇబ్రహ్మీమ్ నగర్ లో 
ఉండేవారు హైదరాబాదు లోని వాసవి జూనియర్ కాలేజ్ లో 
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకొనేవారు
సిరి మరియు మహా చాలా తెలివైనవారు అలాగే
అందంలో , గుణంలో కూడా.
సిరి మహా వాళ్ళది మధ్యతరగతి కుటుంబాలు.
సిరి వాళ్ల తల్లితండ్రులు సిరిని కొంచెం గారాబంగా పెంచారు
సిరి తన చిన్నతనంనుండే తన తల్లితండ్రులకు
అన్నిపనులలోను చేదోడు వాదోడుగా ఉండేది 
ఇంటర్ పూర్తి అయ్యాక వల్ల ఆర్ధిక పరిస్థిని బట్టి డిగ్రీ లో
జాయిన్ అయ్యారు సిరి, మహా
1స్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యిన కొద్దిరోజులకే కొంతమంది
స్నేహితులైయ్యారు.
అందులో శ్రీరామ్ ఒకడు . శ్రీరాం చాలా తెలివైన వాడు, చాలా
మంచివాడు , ఆస్తిపరుడు,
తన తల్లితండ్రులకి శ్రీరాం ఒక్కడే కొడుకు .అందుకేనేమో 
శ్రీరాంని వాళ్లు అతిగారబంగా పెంచారు.  శ్రీరాం సిరిని 
చూసిన మొదటి చూపులోనే తనమీద ఇష్టం పెంచుకొన్నాడు.
 ఆ ఇష్టాన్ని ప్రేమగా అనుకోని సిరితో ఎన్నో సార్లు తన ప్రేమని
 చెప్పాలని ప్రయటినించాడు కానీ వీలు కాలేదు. 
అయితే తన ఇష్టాని చెప్పలేక సిరితో చనువుగా ఒక ఫ్రెండ్గా
ఉండసాగడు ఏ పనిలోనైన సిరికి తోడుగా ఉండేవాడు.
మొదట్లో మహా శ్రీరాంని అంతగా పట్టించుకోలేదు. కానీ
తాను సిరి పై చూపిస్తున్న అభిమానాన్ని చూసి శ్రీరాంని
అడిగింది అప్పుడు శ్రీరాం సిరిని ప్రేమిస్తున్న సంగతి మహాకి
చెప్తాడు. కానీ అందుకు మహా సిరికి అలాంటి ఉద్దేశమేమి
లేదు అనిచెప్పింది.ఎందుకంటే సిరివాళ్ళ ఫ్యామిలీ శ్రీరాం వాళ్ళ
ఫ్యామిలీ కంటే ఆస్తిలో చాలా పేదవారు అవడం అయినా
 శ్రీరాం సిరికి ఎలాగయినా తన ప్రేమ సంగతి చెప్పాలని 
ఎదురుచూసేవాడు. కొన్నిరోజులకి శ్రీరాం సిరిని కలిసి
సిరితో తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. సిరి అందుకు
ఒప్పుకోలేదు కానీ శ్రీరాం మాత్రం తన ప్రయత్నాన్ని
ఆపలేదు. కొన్నిరోజులకి శ్రీరాం మంచితనాన్ని వాడు 
చూపిస్తున్న తన మీద ప్రేమని నమ్మి శ్రీ రాం ని
ఇష్టపడింది.ఇష్టపడింది.వాళ్ళ ప్రేమ ఎంతవరకు అంటే శ్రీరాం 
లేకపోతే సిరి లేదు అన్నంతగా వాళ్ళప్రేమలో మునిగి 
తెలియడారు ఒకరిని ఒకరు ఉండలేరన్నంతవరకు వెళ్ళింది. 
కానీ విధి సైతం కూడా  వాళ్ళ ప్రేమ మీద కన్నెర్ర చేసింది. శ్రీరాం
మరియు సిరి  వాళ్ళ తల్లితండ్రులకు వాళ్ళ ప్రేమ సంగతి 
తెలిసిపోయింది. సిరి వాళ్ల ఇంటిలో వాళ్ల తల్లితండులకి
శ్రీరాం గురించి చెప్పింది. కానీ వల్ల తల్లితండ్రులు వాళ్ళు బాగా 
ధనవంతులు వాళ్లకు మన సంబంధం నచ్చదు అని ఎంత 
చెప్పినా సిరి మాత్రం శ్రీరాం అలాంటివారు కాదు తనని 
ఎప్పటికి మోసం చెయ్యడు అని వల్ల తల్లితండ్రులని 
ఒప్పించింది. కానీ శ్రీరాం ఇంటిలో మాత్రం వాళ్ళ ప్రేమని
శ్రీరాం తల్లితండ్రులు ఒప్పుకోలేదు. శ్రీరాం ఎంత నచ్చచెప్పినా
కూడా వాళ్ళు ఒప్పుకోలేదు.శ్రీ రామ నేను సిరిని తప్ప 
ఇంకెవరిని పెళ్లిచేసుకొనని చెప్పాడు.దాంతో 
శ్రీ రాం వాళ్ళ అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ లో 
జాయిన్ అయ్యారు. డాక్టర్ వాళ్ల అబ్బాయి గురించే 
ఆలోచిస్తూ హార్ట్ పెయిన్ వచ్చింది అని వల్ల అమ్మగారికి 
ఎటువంటి బాధాకరమైన వార్తలు చెప్పకూడదని చెప్పారు  
అమ్మగారి మాట కోసం శ్రీ రామ్ 
తన ప్రేమని సైతం త్యాగం చేసాడు. కానీ సిరి మాత్రం అర్ధం 
చేసుకోకుండా తనని మోసం చేశాడని తన మీద అసహ్యం 
పెంచుకొంది. మహా, సిరీ ఇద్దరు శ్రీరాం కు ఎంతో నచ్చ చెప్పి 
చూసారు కానీ శ్రీరాం ఒప్పుకోలేదు.ఎందుకంటే శ్రీ రాంకి వల్ల 
అమ్మగారు అంటే ప్రాణం వల్లమ్మగారి 
 ఆరోగ్యమే ముఖ్యమునుకుని సిరిని సిరిమీద ఉన్న ప్రేమని 
త్యాగం చేసాడు  శ్రీరామే సర్వస్వం అన్న సిరి తన ప్రేమను 
 మర్చి పోలేక తిండికి నిద్రకు దూరమై ఆరోగ్యం బాగాలేక  
హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది కానీ శ్రీరాం ఏ విధంగానూ 
స్పందించలేదు. కొన్నాళ్ళకి సిరి వాళ్ళ తల్లితండ్రులు సిరికి 
ఒక మంచి అబ్బాయితో పెళ్లి చేసారు. కానీ శ్రీరాం తన 
తల్లితండ్రుల సంతోషానికి తన ప్రేమను కాదనుకొన్నాడు కానీ 
తాను సిరిని మర్చిపోలేదు. ఇందులో తప్పు ఎవరిది అని 
చెప్పలేము ఎందుకంటే శ్రీరాంకి వాళ్ళ తల్లి ఆరోగ్యం కన్నా సిరి
 ప్రేమ ముఖ్యం కాదనుకున్నాడే కానీ తనని వదిలేయాలని 
మోసం చెయ్యాలని అనుకోలేదు కానీ సిరి మాత్రం తనని 
మోసం చేశాడని తన మీద ఎన్నో అభండాలూ వేసింది
 ఇందులో తప్పు ఎవరిది అన్నది ఎలా చెప్పగలం
నిజమైన ప్రేమను పంచిన వాళ్ళమీద (శ్రీ రాం , సిరి)
స్వార్ధపరమైన ప్రేమను పంచిన వాళ్ళ మీద (శ్రీ రాం తల్లితండ్రులు)
చెరిగి పోనీ గుర్తులు కొన్నైతే 
మనమే చెరిపేసుకొన్న జ్ఞాపకాలు ఎన్నో
మంచితనమంటే చేతకాని తనమా
త్యాగం చేయడమంటే ఓర్వలేనితనమా
ఇందులో ఎవరిది తప్పు  సిరీదా
                                     శ్రీరాం దా